7, ఆగస్టు 2012, మంగళవారం

face book ---2

మనం ఈనాడు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన స్వతంత్రం ఎంతోమంది త్యాగ ఫలితం. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉరి కంబాలను ముద్దుపెట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు తుపాకీ గుండ్లకు బలి అయినారు. ఇంకా ఎంతో మంది ప్రాణత్యాగాలు పోరాటంలో చేసారు. జైల్లో మగ్గారు. లాటీ దెబ్బలు తిన్నారు. మన స్వతంత్రం పోరాటంలో గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎంతోమంది జైలు జీవితం గడిపారు. వారి అందరి కృషి ఫలితమే స్వతంత్రం. మరి వారి పోరాటాల ఫలితంగా వచ్చిన స్వతంత్ర భారతావనిలో ఏమి జరుగుతుంది. వ్యసాయిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్య వైజ్ఞానిక, అనేక రంగాలలో కొంత అభివృద్ధి జరిగింది. కాని జరగాల్సిన అంట జరిగిందా అంటే జరగలేదు అని చెప్పలిసిందే. అవినీతి, రాజకీయాలలో అవినీతి నిరుద్యోగం, ఇంకా నిరక్షరాస్యత, మతన్మాదం దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడుస్తున్నాయి. మన ప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు అవినీతి పరులను ఎలక్రటిక్ స్తంబాలకు కట్టి ఉరి వేయాలన్నారు. కాని మనం ఆ స్తాయికి ఎదిగామా అని ప్రశ్నించు కోవాలి. ఇంకా బానిసత్వాని, సమర్ధించే నాయకులు వారి వంది మాగధులు ఉన్నారు. అలాంటి వారివలన ఈ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వాళ్ళకు మనం ఏమి నివాళి అర్పిస్తున్నాము. దండలు వేసి, జన గణ మన పాడేసి, జండా అవిష్కరించేసి అయి పోయింది అంటున్నాము. ఈనాటి కొంతమంది నాయకులకు మన స్వతంత్ర జెండాను ఆవిష్కరించే అర్హత కూడలేదు. అయిన మన దేశంలో, సమత కోససం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. వారి కి మన నివాళి. స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఇంక సమత కోససం, మమత కోసం, ప్రగతికోసం కృషి చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి జోహార్లు చెబుతూ, వారి బాటలో నడడమే ఈనాటి మన కర్తవ్యం.


The so called comrades are working to satisfying their egoism and to increase the wealth of Jagan Mohan Reddy, and Chndra babu naidu and making the people to suffer with lati charge, jails, deaths, even encounter deaths not for left parties unity.


స్వార్ధం శిరస్సును కసితో 

గంద్రగొడ్డలితో నరక మని చెప్పెవారే 
నిజమైన జర్నలిస్ట్లులు 
నిజమైన కమ్యూనిష్టులు 
నిజమైన అంబేద్కరిష్టులు 

నిజమైన సోషలిష్టులు
నిజమైన మేధావులు
నిజమైన మనుష్యులు
నిజమైన విప్లవకారులు
నిజమైన నాయకులు
నిజమైన కార్యకర్తలు
నిజమైన ప్రేమికులు
............
............

శివసాగరుకు క్షమాపణలతో



ప్రతిమలపెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుఁగాని దుః

ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్

మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే

వత లెగవడ్డ దేశమున భాగ్యహీనుల క్షుత్తులాఱునే-----మహా క
వి జాషువ 


అవనిలో గల బీద ధనవంతులొకటిగా
అయ్యే యోగం గూడ వచ్చేనయా 
అయిదు వేల మేర బహుధాన్య లోపల 
అన్ని జాతు లొక్కటయ్యేనయా
కులమనేటి తెగులు కొంపలు కూల్చును 
మతం మత్తు కూర్చు మార్గామ్ము కారాదు 
 --- సద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 

All the wealth at Sri Venkateswara Swamy Temple, Padmanbha Temple, Mantralya Temple, Shiridi Saibab temple and many more temples is to be used for education by establishing schools, colleges, for health by establishing hospitals, for hous
es by constructing child homes, old age homes, houses to poor in all villages in type interest of human. If it is done GODS will also feel happy. If it is done God will give shake hands after their deaths. Other wise GODS WILL NOT WELCOME Hindus again they will sent earth as ants, mosquito, pigs, dogs etc..(since they believe) All the wealth in the temples belongs to Daltits, Band peopel of this country, since wealth is created by labour according to Economics. Not only Karl Marx Frederic Angels economy, Socialist economists but also capitalist economics. Gods will also feeling difficult to bear unworthy, illegal, corrupt wealth at their places and on their heads. If the people not done this work GODS will create Ghajani Ghori and many more to release the unnecessary burden on their heads and at their temples. Then weeping only left to upper caste people. And further blaming the state only remain.


మన రాష్ట్రంలో కమ్యునిస్టు పార్టీల నాయకులు ఎందుకు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం లేదు. ఉద్యమాలు అప్పుడు కలుస్తాము. తర్వాత విడిపోతాము. తరువాత, టి.డి.పి, ఒకసారి, కాంగ్రెస్ కు ఒక సారి, కలవడం ఎందుకు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఆస్తులు పెంచడానికి ఎందుకు ఉపయోగ పడాలి. కమ్యునిస్టు పార్టీల ప్రేమికులను, అభిమానులను ఎందుకు నిరాశ పరచాలి. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, భవిషత్, నిజంగా కోతుకుంటుంటే త్వరగా లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలి. అహంకారాలు అడ్డువస్తే వాటిని పూడ్చి పెట్టండి. కమ్యునిజం లో అహంకారానికి తావులేదు. అది మనువాదంలో, అగ్రకుల ఆహంకారంలో ఉంది.కాంగ్రెస్ ను తిడుతూ కూర్చోవడం మన పనిగా భావించడం జరుగుతుంది. అది కాదు.ప్రజలకు కావలసినది లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ . అది డిల్లీలో కనిపిస్తోంది ఆ వాల్ పోస్టర్ చూస్తుంటే. అది నేను వేసింది కాదు. దానిని గుడ్ పోలిటిసియన్ గ్రూప్ లో ఒక కేరళ కామ్రేడ్ పోస్ట్ చేసారు. ఆ విధంగానే మన రాష్ట్రంలో కమ్యునిస్ట్ స్టు పార్టీలు, ఆర్.పి ఐ , లోకసత్తా, . బి.ఎస్.పి ఇతర దళిత, బి.సి పార్టీలను కలుపుకొని టి.డి. పి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్, టి. ఆర్. ఎస్, కాంగ్రెస్స్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ఈరాష్ట్ర ప్రజలకు సరి అయిన మార్గాన్ని చూపించగలరని ప్రజలు కమ్యునిస్టు పార్టీల అభిమానులు, ప్రేమికులు ఆసిస్తూ వున్నారు.


పదవులా - పార్టీలా -- ప్రజలా.
వనం జ్వాలా నరసింహారావు మరో ప్రక్షాళన అనే వ్యాసంలో కాంగ్రెస్స్ పార్టీకి కాంగ్రెస్స్ సోనియా అని కాంగ్రెస్స్ రాహుల్ అని, కాంగ్రెస్స్ ప్రియాంక అని వ్రాసారు. ఎందుకు ఆ పని చేసారో తెలియదు..ఈ రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోని ఏ రెడ్డి నాయకుడో, ఏ కమ్మ నాయకుడో ఏ దొర నాయకుడి ప్రభావంలో పడి వ్రాసారో తెలియదు. వారికే ఆ విధంగా వ్రాయాలని అనిపిఒన్చవక్చు. వారు ఏ ప్రభావముతో వ్రాసారో తెలియదు. అంతగా కాంగ్రెస్స్ పార్టీని ఆ విధంగా విమర్శించాల్సిన అవసరం ఎందుకు. అవును వారు తెలియ చేసినట్లు కాంగ్రెస్స్ పార్టీని విడచినవారు ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్య మంత్రులు అయ్యారు. రాష్ట్రపతులు అయ్యారు. అయ్యారు దేశానికి, ప్రజలకు ఏమి వరిగింది. వారు అయితే వారి కుటింబ సభ్యులు కాంగ్రెస్స్ పార్టీ వ్యతిరేకులు సంబహ్ర పడి ఉండవచ్చు. కాని ప్రజలకు ఏమి వచ్చింది. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ కాలంలో నే మండల కమిషన్ తో వెనక్న్బడిన వర్గాలకు కొంత న్యాయం జరిగింది. బి.జే.పి వాళ్ళు కమండలం ఉద్యమం చేసి ఆ ప్రభుత్వాన్ని రాజేనామ చేసే టట్లు చేయగలిగారు. కాని జనతదాల్ గాని జనత పార్టీగాని ప్రత్యామ్నయంగా ఎందుకు ఉండలేకపోయినాయి. మేధావులు వున్నారు, నిజాయితిపరులు ఉన్నారు. పార్టీల కోసం ప్రజలకోసం పనిచేసేవారున్నారు. కాని ఎందుకు ఆ పార్టీలు ఉండలేకపోయినాయి. ఆ వ్యాసంలో జ్వాలగారు ప్రస్తావించలేదు. కాంగ్రెస్స్ లోనుంచి బయటకు వచ్చి పదవులు పొందారు అని వ్రాసారు. అంటే రాజకీయ జీవితమంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులేన.. మామూలు కార్యకర్తలు చేసేపని రాజకీయ జీవితం కాదా. . ప్రకాష్ కారత్ ను, సురవరం సుధాకర రెడ్డి, ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించమని వ్రాస్తే బాగుండేది. కమ్యునిస్టు నాయకులు తమ అహంకారపు జైల్లో మగ్గుతున్నారు. వారు ప్రత్యామ్నాయాన్ని చూపించే స్తితిలో లేరు. మరి కాంగ్రెస్స్ కు ప్రత్యామ్నాయం ఏమిటో తెలియచేయకుండా కాంగ్రెస్స్ ను "కాంగ్రెస్స్ సోనియా అని కాంగ్రెస్స్ రాహుల్ అని, కాంగ్రెస్స్ ప్రియాంక " అని వ్రాయడం పక్షపాత ధోరణే అవుతుంది. ఇంకొక వాస్తవం వ్రాయడం మరచిపోయారు. కాంగ్రెస్స్ ను వీడి పార్టీ పెట్టుకున్నవాల్లు, మమతాబెనర్జీ తప్ప అందరు వ్యక్తిగత ఆస్తులు కోట్లల్లో కూడపెట్టుకున్నవారే.. ఆస్తులు కూడపెట్టుకొని పార్టీలు పెట్టుకున్నవారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మనకు కనిపిస్తారు.. మహారాష్ట్రలో శరద్ పవార్ఉన్నారు. జవహరలాల్, ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వ్యక్తిగత ఆస్తులు కూడపెట్టుకోలేదు. కంపనీలు కాంట్రాక్టర్ల పనులు,చేయలేదు,కంపనీలు, బినామి కంపనీలు స్తాపించలేదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు, రాజీవ్ గాంధి వ్యక్తిగత ఆస్తులు కూడపెట్టుకోలేదు. కాంట్రాక్టర్ల పనులు చేయలేదు,కంపనీలు, బినామి కంపనీలు స్తాపించలేదు. రాజీవ్ గాంధి ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు సోనియా గాంధి (రాహుల్ గాంధి , ప్రియాంకా గాంధి చిన్నవాల్లు) వ్యక్తిగత ఆస్తులు కూడపెట్టుకోలేదు. కంపనీలు కాంట్రాక్టర్ల పనులు,చేయలేదు, బోఫర్సు కుంబ కోణం లో వారి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానిని తీవ్రంగా విమర్శించిన జైపాల్ రెడ్డి, కాంగ్రెస్స్ లో ఉన్నారు. కాంగ్రెస్స్ పార్టీ పేరుతొ జవహర్ లాల్ కుటుంబం పేరుతొ వారి జపం చేస్తూస్వంత ఆస్తులు కూడపెట్టుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో మనకు స్పష్టంగా కొంతమంది రెడ్డ్లు, కమ్మవాళ్ళు , దొరలూ, ఇప్పుడు కాపులు కనిపిస్తారు. ఇదిఒక వాస్తవం. కాంగ్రెస్ పార్టీ విమర్శించండి కానీ ప్రత్యమ్నాయాన్నీచూపించండి. ఆస్తులు కంపనీలు నడిపే వాళ్ళను చూపించకండి. నాకు ప్రముఖ సోసలిస్ట్ నాయకులు సురెంద్రమోహన్ మాటలు గుర్తుకొస్తుంటాయి. అవి కాంగ్రెస్ కు ప్రత్యమ్నాయాన్ని చూపించకుండా కాంగ్రెస్ ను విమర్శిస్తే ప్రజలకు న్యాయం చేసినట్లు కాదు. విజ్ఞులు ఆలోచిస్తారని, ఆస్తులు కూడపెట్టుకోనివారిని ప్రత్యామ్నయంగా చూపాయించాలని కోరుకుంటూ.